అక్టోబర్ 6న”మిస్టరీ” విడుదల

 

 

పి.వి.ఆర్ట్స్ బ్యానర్ పైన వెంకట్ పులగం నిర్మాత , తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “మిస్టరీ”.

 

తనికెళ్ల భరణి, అలీ, సుమన్,షన్ను లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది , అక్టోబర్ 6 న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

 

 

డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ఇది ఒక కామెడీ త్రిల్లర్ సినిమా, అవుట్ పుట్ చాలా బాగా వస్తుంది,ఈ రోజు టీం సభ్యులు ఉన్న పోస్టర్ ని విడుదల చేసాం ,

ఈ ప్రాజెక్ట్ నేను చేయడానికి సహకారం చేసిన మా టీం సబ్యులకు ధన్యవాదాలు.

అలానే వెంకట్ దుగ్గిరెడ్డి,రవి రెడ్డి, బాబీ గారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

 

హీరోయిన్ స్వప్న చౌదరి మాట్లాడుతూ మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనేక ట్వీట్స్ తో ప్రేక్షకులని మెప్పిస్తుంది, వినాయక చవితి శుభాకాంక్షలు అని అన్నారు.

యాక్టర్ షన్ను మాట్లాడుతూ ఈ సినిమా లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు,

తెలుగు అమ్మాయిలకు చిత్ర సిమా ఎల్లప్పుడూ ఆదరిస్తుంది,

హీరోయిన్ గా చేసిన స్వప్న , ముఖ్య పాత్రలో చేసిన సత్య సైతం తెలుగు అమ్మాయిలే,

నాకు అవకాశం ఇచ్చిన టీం మెంబర్స్ కి ధన్యవాదాలు.

 

సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, షన్ను, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ , కెమెర – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here