అక్టోబర్ 6న “మిస్టరీ” చిత్రం విడుదల
పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత గా, తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “మిస్టరీ”. తనికెళ్ల భరణి, అలీ, సుమన్, ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా లో సాయికృష్ణ, స్వప్న చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ “మా మిస్టరీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, మంచి ట్విస్ట్ తో అద్భుతమైన సీన్స్ తో రెడీ అయింది. మా చిత్రం లో నటించిన తనికెళ్ల భరణి గారికి, అలీ గారికి, సుమన్ గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. అక్టోబర్ 6 న 100 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.
డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “ఇది ఒక కామెడీ త్రిల్లర్ సినిమా, అవుట్ పుట్ చాలా బాగా వస్తుంది, ఈ రోజు టీం సభ్యులు ఉన్న పోస్టర్ ను విడుదల చేసాం, ఈ ప్రాజెక్టు నేను చేయడానికి సహకారం చేసిన మా టీం సబ్యులకు ధన్యవాదాలు. అలాగే వెంకట్ దుగ్గి రెడ్డి, రవి రెడ్డి, బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్టోబర్ 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది” అని అన్నారు.
సత్య శ్రీ, గడ్డం నవీన్, అకెల్లా, సి.కే.రెడ్డి, శోభన్ లు నటిస్తున్న ఈ సినిమా కి కథ మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ , కెమెర – సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ – సూర్య తేజ గంజి.